33.2 C
Hyderabad
May 15, 2024 22: 31 PM
Slider చిత్తూరు

మదనపల్లె మార్కెట్‌లో టమాటా మోత

#tomato

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర రికార్డు మోత మోగింది. కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలికింది. అత్యల్పంగా కిలో రూ.140 ధరను నమోదు చేసింది. దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది. మదనపల్లె మార్కెట్‌కు కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చింది. బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం,

మదనపల్లె ప్రాంతంలో సీజన్‌ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం కిలో టమాటా రూ. 160 – రూ. 196, రెండవ రకం రూ.120 – రూ.156 వరకు పలికింది. 25 కేజీల బుట్ట ధర రూ.4500 – రూ 4900తో వ్యాపారులు కొనుగోలు చేశారు.

Related posts

ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

నవ ముకురం

Satyam NEWS

అమరావతి రైతులను మళ్లీ అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment