సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉజ్వల సామాజిక స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు ఎం. లక్ష్మి అన్నారు. బాగ్ అంబర్ పేట్ కు తాపీ మేస్త్రి భాస్కర్ రావు ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుటుంబాన్ని ఉజ్వల సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి పరామర్శించి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక సేవలో స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భాస్కరరావు కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి టౌన్ ప్లాన్ రిటైర్డ్ ఏసిపి రవిమన్యు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్