తమిళనాడు రాష్ట్రంలో చెన్నై కు చేరువలో ఏర్పడ్డ ‘నిషార్’ తుపాను…ఈ ఉదయం తీరం దాటింది.ఈ ప్రభావంతో ఆ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం పడింది.
మరీ ముఖ్యంగా ఏపీ రాష్ట్రం పై పడింది. గత రాత్రి నుంచీ రాష్ట్రంలో ని ఉత్తరాంధ్ర లో విశాఖ, విజయనగరం జిల్లాలో ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై వర్షం పడుతోంది.
ఈ మేరకు విజయనగరం జిల్లాలో తుపాను ప్రభావానికి సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు ప్రజలను అప్రమత్తం చేశారు.