వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉద్యోగులు,ఆశా కార్యకర్తలు మొక్కలు నాటారు.
అనంతరం జరిగిన సమావేశంలో మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా కాలంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను ముందుండి నడిపించిన ఘనత డాక్టర్ శ్రీనివాస్ కి దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రజ్వన్,ఆరోగ్య పర్యవేక్షకులు గజగంటి ప్రభాకర్, నూర్జహాన్ బేగం,ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్,సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్