వాహనాల తనిఖీలలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. టూ వీలర్ , ఫోర్ వీలర్, ఆటో రిక్షా ,సరైన పత్రాలు లేని40 వాహనాలను కేసులు నమోదు చేశారు ,డ్రంకెన్ డ్రైవ్ ఇద్దరిపై కేసులు పెట్టారు.
మిర్యాలగూడ సాగర్ రోడ్ లో ఈ తనిఖీలు నిర్వహించారు. టూ టౌన్ సీఐ నరసింహ రావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కోటేష్, పోలీస్ సిబ్బంది వున్నారు.