ఉప్పల ఫౌండేషన్ అధినేత ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
చాలా కాలంగా ఉప్పల ఫౌండేషన్ ఎంతో మంది పేద వారికి సాయం అందిస్తున్నది.
కరోనాతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నందున తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టిక ఆహారం అందించారు.
కాజు, బాదం, అంజూర్, బెల్లం, కొబ్బరితో తయారు చేసిన డ్రైఫ్రూట్ లడ్డు, రాగిలడ్డు, రాగి అంబలి లను రోగులకు సరఫరా చేశారు.
అదే విధంగా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెక్షన్ కు వంద బెడ్ షీట్లను అందచేశారు.
హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రేపు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ రొంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.