38.2 C
Hyderabad
April 29, 2024 20: 34 PM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

#nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సంచలనం కలిగించింది.

తన భర్త బతికి ఉండగా ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిని ఆయన చనిపోయిన తర్వాత ఆయన సోదరుడు ఆక్రమించాడని బిజినపల్లి మండలం సల్కరిపేట గ్రామానికి చెందిన తిప్పర్తి జ్యోతి అనే మహిళ ఆరోపిస్తున్నది.

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఏ అధికారి తన భూ తగాదాకు పరిష్కారం చూపడంలేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇద్దరు కొడుకులతో వచ్చి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

నిప్పు అంటించుకునే సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు.తన భర్త చంద్రారెడ్డి 2015లో చనిపోయాడని అప్పటి నుంచి ప్రభుత్వం ఇచ్చిన పట్టాను ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి కబ్జా పెట్టాడని ఆమె తెలిపారు.

తనకు ఆస్తిలో భాగం ఇవ్వడం లేదని, ఇంట్లో ఉండనివ్వడం లేదని అదే విధంగా పొలం కబ్జా పెట్టి కౌలుదారులను రానివ్వడం లేదని జ్యోతి తెలిపారు.

Related posts

అవినీతి పార్టీ వైకాపా: బీజేపీ ఎంపి కే లక్ష్మణ్

Bhavani

భార్య కోసం చెమటోడుస్తున్న అఖిలేష్ యాదవ్

Satyam NEWS

Save Amaravati: ఇప్పటికైనా మనసు మార్చుకోండి

Satyam NEWS

Leave a Comment