నాణ్యమైన, మన్నికైన ఔషధాలను ప్రజలకు అందించాలని, వ్యాపార రంగంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రామంతపూర్లోని గణేష్నగర్ కాలనీలో బుధవారం ఆదిత్య పార్మసీ మెడికల్ స్టోర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ నాణ్యమైన, మన్నికైన ఔషధాలు ప్రజలకు అందించాలని తెలిపారు. వ్యాపార రంగంలో మంచిగా రాణించాలని, దానితో పాటు మందులు అవసరమైనవారికి కొంత రాయితీ ఇవ్వాలన్నారు. ఈ ప్రాంతంలో ఆదిత్య పార్మసీ మెడికల్ స్టోర్ అందుబాటులోకి రావడం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నిర్వహకులు ప్రశాంత్ మాట్లాతూ మా మెడికల్ స్టోర్లో నాణ్యమైన, మన్నికైన ఔషదాలు (మందులు) దొరుకుతాయని, రు.1000 ఔషదాల కొనుగోలు పై 20% డిస్కౌంటు ఇస్తున్నామని ఈ సదవకాశాన్ని ప్ర.జలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్ , గరిక సుధాకర్, లక్ష్మినాయాయణ, మేకల ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.