26.7 C
Hyderabad
May 16, 2024 08: 05 AM
Slider ఖమ్మం

డొంక రోడ్డు అభివృద్ధి

#public

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలో అనేక గ్రామాల్లో ఉన్న డొంక రోడ్లను అభివృద్ధి చేసి రైతులకు తమ పొలాల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో గ్రామాలకు, రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు అనువుగా లేని డొంకలను విస్తరించి అభివృద్ధి చేయాలని వివిధ గ్రామాల రైతులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి రూ 2 కోట్ల రూపాయలతో అనేక గ్రామాల్లో ఇలాంటి డొంకలను విస్తరించి అభివృద్ధి చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హర్యతండా గ్రామంలోని  ఇరుకైన డొంక రోడ్డును ఇలా విస్తరించి అభివృద్ధి పరచడం పట్ల రైతులు ఆనందోత్సవాములతో రోడ్డు మీద తిరిగి ఆనందం వ్యక్తం చేశారు.  తన  నిధులను సింహభాగం మండలంకే వెచ్చించి ప్రతి గ్రామంలో రోడ్లు,  డ్రైన్లు, గ్రామాల మధ్య లింకు రోడ్లు, అంతర్గత రోడ్లు ఇలా అనేక ప్రాంతాల్లో  రోడ్లు సైతం వేసి ఎక్కడ మట్టి రోడ్లు లేకుండా మండల వ్యాప్తంగా ప్రజలకు, రైతులు రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చారు.

Related posts

ఘనంగా జగనన్న క్రీడా సంబరాల ప్రైజ్ మనీ పంపిణీ

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన‌ హీరోయిన్

Sub Editor

సుప్రీంకోర్టుకు వెళుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam NEWS

Leave a Comment