ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక వృత్తి శిక్షణ తరగతులు సురేందర్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక వృత్తి శిక్షణా తరగతులను కళాశాల ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వృత్తి శిక్షణా వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగముంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సదానందం గౌడ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.