ఏవోబీలో కటాఫ్ ఏరియా ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
మృతుల్లో ఒకరిని మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సబ్యుడు మల్లన్న గా గుర్తించారు. మరొక మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది.
ఒడిశా కు చెందిన ఎస్వోజీ, డీవీఎఫ్ బలగాలు కటాఫ్ ఏరియా ప్రాంతంలోని ఎగజనభ సమీపంలో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
సింగారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తున్నట్టు పోలీసులు అనుమానించి ఆ దిశగా కదలడంతో ఎన్ కౌంటర్ జరిగింది.