28.7 C
Hyderabad
April 26, 2024 10: 49 AM
Slider ముఖ్యంశాలు

మల్దకల్ లో అన్నదాత ఆత్మీయ సంబరాలు ప్రారంభం

#Annadata Athmiya

గద్వాల నియోజకవర్గంలో మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ,జాతర సందర్భంగా అన్నదాతల ఆత్మీయ సంబరాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యఅతిథిగా ఎంపీపీ రాజారెడ్డి చేతుల మీదుగా నేడు ప్రారంభం అయ్యాయి. మూడవ రోజు కొనసాగుతున్న రైతు సంబరాలను వృషబాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎద్దుల బండి లాగుడు పోటీలను ప్రారంభించారు. వృషభ రాజుల యజమానులను ఎంపీపీ రాజారెడ్డి చే శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతు పరబ్రహ్మ గా బి. ఆర్. ఎస్ తో దేశం లోని రైతులకు రైతు రాజ్యం రావాలని కృషి చేస్తూ ఆంగ్లీ బార్ కిసాన్ కా సర్కార్ అనే నినాదంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారన్నారు. నడిగడ్డ ప్రాంతంలో రైతు సంబరాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ రైతు సంబరాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో రైతులకు, పాడి పంటలు బాగా పండాలని, రైతులు ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఎంపీపీ రాజారెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకోబ్, ఉప సర్పంచ్ సికిన మల్దకల్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంపిటిసి గోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటన్న, కో ఆప్షన్ మెంబర్ హైదర్ పాష, టిఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మహేష్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చక్రధర్ రెడ్డి, తుమ్ కృష్ణారెడ్డి, కొత్తింటి జయమ్మ నారాయణ, నరేందర్, మధు, పరుష, ప్రభాకర్, నారాయణ, జమ్మన్న, శేషాద్రి నాయుడు, కార్యకర్తలు, నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

31వ రోజుకు చేరిన గడపగడపకు బిజెపి ప్రజా యాత్ర

Satyam NEWS

మై ఒపీనియన్ : ఇందిరాగాంధీ గ్యాంగ్ స్టార్ల ఇంటికి వెళ్ళేది

Satyam NEWS

ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment