ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు అందరూ లైట్లు ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకున్నామని టీఎస్ జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్ కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయండి. పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలు అందరు లాక్ డౌన్ పాల్గొని కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టండి. అప్పుడే కరోన పై మన విజయం సాధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉంది. మా ఇంజనీర్లు వారి జాగ్రత్త లో వారు ఉన్నారు. ఇప్పటికే జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశాం అని ప్రభాకర్ రావు అన్నారు.