ఈశాన్య చైనాలోని చాంగ్చున్ నగరంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగడంతో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చాంగ్చున్ న్యూ ఏరియా పారిశ్రామిక ప్రాంతంలోని హైటెక్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 12.40 గంటలకు అగ్నిప్రమాదం సంభవించినట్లు చాంగ్చున్ న్యూ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా మేనేజ్మెంట్ కమిటీ సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్ట్లో తెలిపింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, వారిని ఆసుపత్రిలో చేర్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చాంగ్చున్ చైనాలోని జిలిన్ ప్రావిన్స్కు రాజధాని మరియు వాహన తయారీ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.