కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు కోదండరాముడి బ్రహ్మోత్సవాలతో బాటు పోతన జయంతి కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
టీటీడీ వేద పండితులు ఇప్పటికే ధ్వజారోహణం జరిపిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల దర్శనం నిలిపివేశారు. కేవలం వేద పండితులు, టీటీడీ అధికారుల ఆధ్వర్యంలోనే శ్రీ సీతా రాముల వారి కళ్యాణోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం జరిగిన విషయం తెలిసిందే.
రాజంపేట ఎమ్మెల్యే టీటీడీ మెంబర్ మేడా మల్లికార్జున రెడ్డి తదితరులు ధ్వజారోహణం లో పాల్గొన్నారు. సతీసమేతంగా కోదండరాముని దర్శించుకున్న మేడా మల్లికార్జున రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాములోరి కి పట్టు వస్త్రాలు సమర్పించారు.