యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో ఒక్కసారిగా రెండంతస్తుల భవంతి కూలిపోయింది. ముందు భాగం బాల్కనీ వరకూ కూలిపోవడంతో దుర్ఘటన జరిగింది. ఈ సంఘటన సమయంలో బాల్కనీ కింద ఉన్న నలుగురు చనిపోయారు.
ఇంటి యజమాని గుండ్లపల్లి దశరథ గౌడ్ (70) సుంచు శ్రీనివాస్(అలియాస్)చపాతీ శ్రీను(40), అంగటి ఉపేందర్(45)శ్రీనాథ్ మరణించగా బ్యాటరీ గిరి (45) అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడగా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో మరణించిన ముగ్గురు యువకులు స్నేహితులు ప్రతి రోజు సాయంత్రం పూట ఈ భవనంలో గల బట్టల దుకాణంలో కూర్చుని కాల క్షేపం చేస్తుంటారు ఎప్పటి మాదిరి శుక్రవారం ముగ్గురు ఒకే చోట కూర్చుని ఉండగా భవనం మొదటి అంతస్తు కూలి వారిపై పడటం తో శిధిలాల కింద పడి మృతి చెందారు చనిపోయిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.