ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్ వార్డ్ ఆఫీస్ లో రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రామంతపూర్ డివిజన్ అభివృద్ధి పథంలో నడవాలని ప్రజలు కార్యకర్తలు అందరూ సుఖంగా ఉండాలని కోరారు. దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ అని అన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ అని అందరి ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి పండుగ జరుపుకోవాలని కోరారు.రేవు నరసింహ కురుమ మాట్లాడుతూ డివిజన్ ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ కార్యకర్తలు అందరూ కృషితో ఎప్పుడూ సుక సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కార్పొరేటర్ దీపావళి టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్రావు , మేడ్చల్ జిల్లా ఓ బి సి ప్రధాన కార్యదర్శి రేవు నరసింహ కురుమ, తాళ్ల బాల కృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూరి కుమారస్వామి, ఉలుగొండ నారాయణ దాస్, డివిజన్ ఓబిసి అధ్యక్షులు వేముల తిరుపతయ్య, డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు రెడ్డి మహేశ్వర్ రెడ్డి, వేముల వెంకట్ రెడ్డి, దయానంద రెడ్డి, నిశాంత్, పాల్గొన్నారు