38.2 C
Hyderabad
May 3, 2024 21: 44 PM
Slider ముఖ్యంశాలు

అగ్నిప్రమాదంలో 700 దుకాణాలు దగ్దం

#fireaccident

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 700 లకు పైగా దుకాణాలు కాలిబుడిదయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ డైలీ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 700 దుకాణాలు దగ్ధమయ్యాయి.  తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

కానిస్టేబుళ్ళ వ్రాత పరీక్షకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

Satyam NEWS

వ్యక్తిని చావబాది.. నోట్లో మూత్రం పోసిన జులాయిలు

Bhavani

28న ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు

Bhavani

Leave a Comment