ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 700 లకు పైగా దుకాణాలు కాలిబుడిదయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ డైలీ మార్కెట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 700 దుకాణాలు దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
previous post
next post