40.2 C
Hyderabad
May 5, 2024 15: 26 PM
Slider ముఖ్యంశాలు

కానిస్టేబుళ్ళ వ్రాత పరీక్షకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

#depikaips

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెన్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (ఎ.పి.ఎస్.ఎల్.పి.ఆర్.బి.) ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ఈ నెల 22న నిర్వహిస్తున్న ప్రాధమిక వ్రాత పరీక్షకు అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ వ్రాత పరీక్షను జిల్లాలో 43 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు నిర్వహిస్తామన్నారు.

విజయనగరం లో 28, బొబ్బిలిలో 13, రాజాంలో 2 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి, స్ట్రాంగ్ రూంలు, భద్రత, సిసి కెమెరాల పనితీరును పర్యవేక్షించారన్నారు. అభ్యర్థులను పరీక్షించిన తరువాతనే ఉదయం 9గంటల నుండి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 10గంటల తరువాత ఎవ్వరినీ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు.

అంతేకాకుండా, అభ్యర్ధులు తమ వెంట తెచ్చుకొనే విలువైన సామాన్లును వారే సొంతంగా భద్రపర్చుకోవాలన్నారు. హాల్ టిక్కెట్స్ లో  సూచించిన నియమ, నిబంధనలు అభ్యర్థులు కుణ్ణంగా చదువుకొని, వాటిని పాటించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్ లు, బ్లూ టూత్, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను అనుమతించమన్నారు.

అటువంటి వస్తువులను ఎవ్వరూ పరీక్షా కేంద్రాలకు తీసుకొని రావద్దని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ సూచించారు. పరీక్షా కేంద్రాల దగ్గరు 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉంటున్నందున, ఎవ్వరూ గుంపులుగా ఉండకూడదన్నారు. అంతేకాకుండా, పరీక్షా కేంద్రాలకు దగ్గరలోగల జెరాక్స్ షాపులను మూసి వేయిస్తామన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కొరకు వారికి దిశా నిర్దేశం చేసేందుకు రైల్వే స్టేషను, బస్సు స్టేషనులో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తామన్నారు.

పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 9 రూట్స్ విభజించి, ఒక్కొక్క పోలీసు అధికారిని బాధ్యులుగా నియమించామన్నారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్లైయింగ్ స్వ్కాడ్ ల ను కూడా నియమించామన్నారు.

జె.ఎన్.టి.యూ.పరీక్షా కేంద్రానికి వెళ్ళేందుకు వాహనాల సౌకర్యం కాముందూ పోలీసుశాఖ ప్రత్యేకంగా రెండు వాహనాలను ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ వాహనాలు అభ్యర్థులు జె.ఎన్.టి.యు. జంక్షన్ నుండి పరీక్షా కేంద్రం వరకు తీసుకొని వెళ్ళేందుకు, తిరిగి జె.ఎన్.టి.యు.జంక్షన్ చేర్చేందుకు వినియోగిస్తామని, అభ్యర్థులు ఈ ఉచిత రవాణ సౌకర్యం సద్వినియోగం చేసుకోవచ్చునని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

Related posts

సీఎంఎస్-1 నింగిలోకి కౌంట్ డౌన్ ప్రారంభం

Sub Editor

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

Sub Editor 2

అదర్శ పురపాలికలుగా మార్చాలి

Satyam NEWS

Leave a Comment