41.2 C
Hyderabad
May 4, 2024 17: 24 PM
Slider ఖమ్మం

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలి: AISF

#aish

మధిర పట్టణంలోని స్థానిక ప్రభుత్వ  బాలికల(గర్ల్స్ హై స్కూల్) పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించడం లేదని మెనూ సక్రమంగా పాటించడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు విద్యార్థులకు సంఘీభావంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ విద్యార్థులు కలిసి మాట్లాడటం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులు కు నాణ్యమైన భోజనం అందించడం లేదని మెనూ సక్రమంగా పాటించడం లేదని ఆయన విమర్శించారు విద్యార్థులకు అన్నానికి బదులుగా పులిహార వడ్డిస్తున్నారని ఎంతవరకు సమంజసం అని దీనిపై ఉన్నత అధికారులు దృష్టి సారించి సంబంధిత బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

పాఠశాలలో సమస్యపై అడిగేందుకు వెళ్లగా విద్యార్థి సంఘాల నాయకులు పై హెచ్ఎం దురుసుగా ప్రవర్తించడం తగదని ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో సక్రమంగా మెనూ అమలయ్యే విధంగా చర్యలు తీసుకొని విద్యార్థులకు తగు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు పట్టణంలోని అనేక పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మధిర మండల నాయకులు సంతోష్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రత్నాకర్ కు కాపు జాగృతి అభినందన

Satyam NEWS

వెన్నుపోటు పొడిచిన మరాఠా యోధుడు

Satyam NEWS

ఫైనల్: ఫలించిన ముఖేష్ అంబానీ రాయ ‘బేరం’

Satyam NEWS

Leave a Comment