హైదరాబాద్ లోని కూకట్ పల్లి కె పి హెచ్ బి కాలనీ లోని జె ఎన్ టి యు రోడ్డు మంజీరా మాల్ పక్కన గల పోచమ్మ ఆలయ ప్రాంగణం లోశ్రీ ధర్మశాస్త భక్తసమాజ్ వారి ఆధ్వర్యంలో మొదలైన ఆయప్ప స్వాములకు భిక్ష, అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు.
స్ధానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ హాజరై అన్న సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్, గురు స్వాములు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఐదో సంవత్సరం జరుగుతున్నదని తెలిపారు.
మాల ధరించిన స్వాములకు సేవ చేస్తున్నటువంటి ధర్మశాస్త భక్తసమాజ్ వారితో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉంది అని కార్పొరేటర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులే కాకుండా భవానీ మాల, ఆంజనేయు మాల తదితర మాలలు ధరించిన స్వాములు కూడా భిక్ష, అల్పాహార కార్యక్రమానికి ఆహ్వానితులే. 22-10-2020 నుండి 05-01-2021 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు హాజరు కావాలని కోరారు.