మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్ పల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అధ్వర్యంలో జరిగిన దసర అలయ్ భలయ్ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి జరుపుకొనే పండుగ దసరా అని, జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని అన్నారు.
అలయ్ బలయ్ లో ప్రజలతో ఆత్మీయ ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, కవి గాయకులు, మిట్టపల్లి సురేందర్, గాయని మధుప్రియ, స్థానిక ప్రజా ప్రతినిదులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం