ములుగు జిల్లా, కాసిందేవిపేట గ్రామానికి చెందిన అరిమిండ్ల దేవేందర్(30) ఇటీవల ఆకస్మికంగా మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వారి కుటుంబాన్ని కాసిందేవిపేట డైనమిక్ యూత్ కమిటీ వారు పరామర్శించి 2వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
యూత్ కమిటీ వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో ఉన్న వారి ఆర్థిక పరిస్థితిని ఆలోచించి ప్రభుత్వం వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ యూత్ కమిటీ ప్రెసిడెంట్ కటుకూరి జైపాల్, వైస్ ప్రెసిడెంట్ కనకం రంజిత్, మరియు కమిటీ సభ్యులు ప్రసాద్, శివాజీ, వినయ్, దినేష్, కవ్వంపల్లి శ్రీకాంత్, ధర్మరక్షక్, ప్రదీప్, చింటూ, మజ్ను, కిరణ్, మధుకర్, రాజేష్, రిపోర్టర్ కవ్వంపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.