భారాసకు చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు 10వేల జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు.
2018నాటి ఈ కేసులో సునీత ఇప్పటివరకు కౌంటర్ పిటిషన్ వేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు 10వేల జరిమానా విధిస్తూ అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.