40.2 C
Hyderabad
May 6, 2024 16: 27 PM
Slider నల్గొండ

కోవిడ్ పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

#omikran

ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని ఎవరో అన్నారని నిర్లక్ష్యం చేయవద్దని, మనకేం కాదని సరదాగా తీసుకోవద్దని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ 3వ,వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి మనకి లేదని,ముఖ్యంగా మధుమేహం,రక్తపోటు,క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిలో రోగనిరోధక శక్తి  తక్కువగా ఉంటుందని,అలాంటి వారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.గర్భిణీ స్త్రీలు,బాలింతలు,నవజాత శిశువులు విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్త వహించాలి కోరారు. వీలైనన్ని జాగ్రత్తలు పాటిస్తూ మన విధుల్ని నిర్వహించుకుందామని,ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించటం, శానిటయిజర్ ఉపయోగించటం చేయాలని,ఎటువంటి లక్షణాలు కనిపించినా అలసత్వం చేయకుండా వెంటనే వైద్యులని సంప్రదించాలని అన్నారు.

జాగ్రత్తలు కేవలం మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తాయని,ఇటువంటి చిన్నపాటి విషయాలని మన బాధ్యతగా భావించి నిత్యా జీవితంలో అలవాటు చేసుకుంటే మన ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా ఇవ్వాలి

Murali Krishna

ఐ ఎఫ్ టి యూ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

Satyam NEWS

వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు

Satyam NEWS

Leave a Comment