34.7 C
Hyderabad
May 5, 2024 01: 32 AM
Slider నల్గొండ

29 న మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి

#hujurnagar

ఈనెల 29 న రాష్ట్ర మంత్రులు హుజుర్ నగర్ నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని వారి పర్యటనను విజయవంతం చేయాలని మఠంపల్లి మాజీ యం పి పి మూడవత్ కొండానాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం వర్ధపురం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కొండానాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రాష్ట్ర ఐటి,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్,విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాధోడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని అన్నారు.

శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని, గత ప్రభుత్వాల హయాంలో దోచుకొని దాచుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. శానంపూడి సైదిరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్య తనదిగా భావిస్తూ ప్రజా సేవకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా  సైదిరెడ్డి నిలిచిపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే పై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని, సరియైన సమయంలో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మంత్రుల పర్యటన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్, మండల అధికార ప్రతినిధి రామావత్ రవీందర్ నాయక్,సర్పంచ్ లు రామారావు,శ్రీను,వరదాపురం మాజీ సర్పంచ్ దొండపాటి కృష్ణయ్య,యస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లె మట్టయ్య, మల్లారపు గోపి,ధైదా ఎమ్మానియెల్, రమణా రెడ్డి,బత్తుల శంకరయ్య,నందిపాటి రాజు,ఏసు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

పాకిస్తాన్ బయటపడేందుకు మార్గం కూడా ఉన్నది….

Satyam NEWS

ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

నీళ్లు లేక హనుమాన్ భక్తుల అవస్థలు

Satyam NEWS

Leave a Comment