కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సమస్యల పరిష్కారానీకి కృషి చేస్తానని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం కుషాయిగూడ గవర్నమెంట్ హాస్పటల్ వెనుక లైన్ లో డ్రైనేజీ అప్ అండ్ డౌన్ ఉండడంవల్ల నీళ్లు ముందుకు వెళ్లక ఇబ్బందులు పడుతున్నామని స్థానికుల ద్వారా తెలుసుకుని స్వయంగా వచ్చి పరిశీలించి సంబంధిత అధికారులకు సమస్య పునరావృతం కాకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే గల్లీ లో కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలనే స్థానికుల విన్నపాన్ని తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
previous post
next post