29.7 C
Hyderabad
May 4, 2024 06: 17 AM
Slider ఖమ్మం

తహశీల్దార్, పోలీస్ స్టేషన్ పనులన్నీ పూర్తి చేయాలి

#Puvvada Ajay Kumar

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్ , రూ.50 లక్షలతో నిర్మిస్తున్న తహశీల్దార్

కార్యాలయాల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన సందర్భంగా ఆయా పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి మంత్రి పువ్వాడ పరిశీలించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంబరాలు జరుకునే విధంగా 10వ తేదీ లోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించుకుని ఇక్కడి నుండే సేవలు అందించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆయా సేవలు పొందడానికి వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా, చెట్లు, టాయిలెట్స్, త్రాగు నీరు, పార్కింగ్, వేచిఉండే గదిలో ఫ్యాన్స్ ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాలని, 10వ తేదీన ప్రారంభించుకునేలా అందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Related posts

బండి సంజయ్ ను కలిసిన సూర్యాపేట జిల్లా బిజెపి పార్టీ నాయకులు

Satyam NEWS

పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే మేనిఫెస్టో

Bhavani

త్వరలో పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగవచ్చు

Satyam NEWS

Leave a Comment