ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్ , రూ.50 లక్షలతో నిర్మిస్తున్న తహశీల్దార్
కార్యాలయాల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన సందర్భంగా ఆయా పనులను జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి మంత్రి పువ్వాడ పరిశీలించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంబరాలు జరుకునే విధంగా 10వ తేదీ లోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించుకుని ఇక్కడి నుండే సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆయా సేవలు పొందడానికి వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా, చెట్లు, టాయిలెట్స్, త్రాగు నీరు, పార్కింగ్, వేచిఉండే గదిలో ఫ్యాన్స్ ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాలని, 10వ తేదీన ప్రారంభించుకునేలా అందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.