భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని శుక్రవారం ఢిల్లీ లోని ఆయన నివాసంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బోబ్బా భాగ్యరెడ్డి,తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రస్తుత స్థితిగతులు,కనీస మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల గురించి,డి ఎం ఎఫ్ టి,సి ఎస్ ఆర్ నిధుల ఖర్చుల వివరాల గుర్చి, నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీల అక్రమ మైనింగ్,నిషేధిత రసాయనాల వినియోగం,స్థానికులకు ఉద్యోగ కల్పన విషయాల గురించి కులంకుశంగా చర్చించినట్లు భాగ్యరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఓబీసీ అధ్యక్షుడు అంబళ్ళ నరేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్,రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగి రాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్