కౌలు రైతుల నిజ జీవితంలో జరిగే పలు సంఘటనలను ఉదహరిస్తూ ఆర్. వి. రెడ్డి బ్యానర్లో నంద్యాల సాయి కళ్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రం పుడమి. కాగా ఇందుకు సంబంధించిన సినిమా పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యుల
సమక్షంలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ నేపధ్యంలో చిత్రీకరించిన ఈ సినిమాను సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆదరించాలని ఈ
సందర్భంగా పొంగులేటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ బాధ్యులు నంద్యాల సాయి కళ్యాణ్, చింతమళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.