అభివృద్ధి పనుల్లో నాణ్యత కలిగిన ప్రమాణాలతో నిర్మించాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట డివిజన్ లోని ప్రేమ్ నగర్ బస్తీలో 8.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కుషాల్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, టీఆర్ఎస్ పార్టీ అంబర్ పేట డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ముదిరాజ్, నాయకులు రామారావు యాదవ్, లింగా రావు, సతీష్, ప్రకాష్, సతీష్ గౌడ్, నాగరాజ్, సలీం, యూసఫ్, హైమద్ అలీ, భవాని, ఆండాలమ్మ, ముంతాజ్ అప్ప మరియు బస్తీ వాసులు రాజు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.