40.2 C
Hyderabad
May 1, 2024 18: 49 PM
Slider కడప

జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు: వైఎస్ షర్మిలా రెడ్డి

#yssharmila

సీఎం జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదని పిసిసి అధ్యక్షురాలు, వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. వైఎస్సార్ పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదు. బూతద్దం పెట్టీ చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడవు. జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన అని ఆమె విమర్శించారు. తన బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని నిందితుడు అని సీబీఐ చెప్పిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. హత్య వారే చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ చెప్పింది. కాల్ రికార్డ్స్,గూగుల్ మ్యాప్స్,లావాదేవీలు అన్ని ఉన్నాయని చెప్పింది. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు అని వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.

Related posts

Accident: రోడ్డు డివైడర్ ను ఢీకొని ఇద్దరు మృతి

Satyam NEWS

డెత్ టెన్షన్:భయంతో జైల్లో నిర్భయదోషుల పిచ్చిచేష్టలు

Satyam NEWS

108 వాహనాల్లో రూ.307 కోట్ల ప్రజాధనం దోపిడీ

Satyam NEWS

Leave a Comment