కర్ణాటక పోలీసులు భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున విలువైన వస్తువులు దొరకడం ఇదే ప్రధమం. రైడ్లో రూ. 5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలు మరియు 68 వెండి కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి పోలీసులు కంబళి బజార్లోని హేమా జ్యువెలర్స్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించగా ఈ మొత్తం దొరికింది. దీనివిలువ మొత్తం రూ.7.6 కోట్ల నగదు, బంగారం, వెండి గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల నగల ఆభరణాలు, 68 వెండి కడ్డీలు ఉన్నాయి. హేమ జ్యువెలర్స్ యజమాని నరేష్ సోనీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
previous post