ఇష్టదేవుడి ప్రసాదాలు దేహదారుఢ్యాన్ని పెంచేలా ఉండాలని రాష్ట్రంలోని ఆలయాల్లో చిరుధాన్యాల లడ్డూను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ దృష్టి సారించింది. తాజాగా చిరుధాన్యాలతో ప్రసాదాల తయారీ, విక్రయాలను యాదాద్రిలో శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. అయిదు రకాల చిరుధాన్యాలు, బెల్లంతో తయారు చేసిన 80 గ్రాముల లడ్డూను రూ.40కు విక్రయించాలని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించింది.