శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ప్రధానోపాధ్యాయులు ఐ డి వి ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎనిమిదవ వర్ధంతి నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎందరికో ఆదర్శప్రాయుడని విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక ఆలోచనలను రేకెత్తించే అనేక ఉపన్యాసాలను ఇచ్చి చాలామందికి మార్గదర్శకుడు అయ్యారని తెలిపారు. దేశంలో అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆ పదవికి వన్నెతెచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు కరణం శ్రీహరి, బుడుమూరు అప్పలనాయుడు, వండాన రామారావు, తాండ్ర వెంకట రమణమూర్తి, పూజారి రవి,బలివాడప్రభాకరరావు, దాష్టిసుధామణి, బెండి శారద, గొటి వాడ సుభద్రా దేవి, పిసిని వసంతరావు, భాను షాజాది, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, తంగి పద్మావతి, బొంగు వెంకటరమణమూర్తి, కొణ పల శ్రీనివాసరావు, సిఆర్పి పంచిరెడ్డి మోహనరావు విద్యార్థులు పాల్గొన్నారు.