తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చం నాయుడుని రాజంపేట నియోజకవర్గ యువ నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గం రాజకీయ పరిస్థితులను చర్చించారు. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుని కలిసిన సందర్బం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు అచ్చెం నాయుడు స్వగృహంలో కలిసినట్టు మేడా విజయ్ తెలిపారు.
రాజంపేట అసెంబ్లీ టికెట్ ఆశవాహుడిగా ఉన్న విజయ్ వరుసగా తెదేపా నాయకులను కలుస్తున్నారు.ఇదే సందర్భంగా అచ్చెం నాయుడి ఆహ్వానం మేరకు విజయవాడలోని ఆయన స్వగృహంలో సుమారు గంట పాటు పాలు రాజకీయ విషయాలు చర్చించడం,చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుందాం అని అచ్చెం నాయుడు తెలిపినట్టు మేడా విజయ్ తెలిపారు.రాజంపేట అసెంబ్లీ టికెట్ తనకు ఇస్తే తప్పక రాజంపేటను చంద్రబాబు బహుమతిగా అందిస్తాని రాష్ట్ర అధ్యక్షుడికి మాట ఇచ్చానని మేడా విజయ్ తెలిపారు.
కార్యక్రమంలో ఆయన వెంట మాల మహానాడు ఈశ్వర్,తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దొన్ను దొర,ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ నాయక్,మాజీ రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల విజయ్ సాగర్,తెలుగు యువత రాజంపేట అధ్యక్షులు రాము యాదవ్,జిల్లా మాజీ టీచర్ అసోసియేషన్ అధ్యక్షులు అది శేషా రెడ్డి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.