ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ టెస్ట్ (జీఈఎస్-2024)ను డిసెంబర్ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదుపుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ. 5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
previous post
next post