స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు సంబంధించిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. దాంతో ఒక్క సారిగా అధికార వైసీపీకి షాక్ తగిలినట్లయింది. చంద్రబాబునాయుడుకు బెయిల్ రాకుండా శత విధాలా ప్రయత్నించిన ఏఏసీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇరుపక్షాల వాదనలు విని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో ఇటీవల మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
previous post