వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె.రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది.
ఏపి పోలీసు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సునీల్ కుమార్ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి హిందూ మత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
ఈ విషయంపై ఏపీ చీఫ్ సెక్రటరీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. రఘురామకృష్ణంరజు లేఖ, సునీల్ కుమార్ విద్వేష పూరిత ప్రసంగ వీడియోల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
సునీల్ కుమార్ పై చర్యలు తీసుకుని అలా తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.
కాగా గతంలో సునీల్పై కేంద్ర హోంశాఖకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ కన్వీనర్ వినయ్ జోషి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.