మా వీధిలో మీకేం పని. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని వైసీపీ నాయకులు టీడీపీ క్లస్టర్ ఇన్చార్పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి యత్నించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం రాజంపేట పట్టణలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ మిరియాల జ్యోతి టీడీపీ చేపట్టిన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇన్చార్జ్ ఆకుల వీధి, ఉస్మాన్ నగర్ లో శనివారం ప్రచారం చేస్తుండగా మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి, మర్రి కల్యాణ్ లు తనను అడ్డుకుని మా వీధిలో మీకేం పని అని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి దురుసుగా ప్రవర్తించడంతో పాటు తనపై దాడికి యత్నించారని ఆమె తెలిపారు.
దీనిపై రాజంపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన నేత అతికారి దినే శ్లీలతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఆధ్వర్యంలో ఓటర్ల వెరిఫికే షన్ చేస్తున్న టీడీపీ మహిళా నేతపై వైసీపీ వారు దాడికి పాల్పడటం దారుణమన్నారు.
ఓటమి భయం తోనే అధికార పార్టీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, భవిష్యత్తులో ఇటువంటి తరహా ఘటనలు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వైసీపీ నాయకు లను హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అండటా ఉంటామని భరోసా ఇచ్చారు.పట్టణ సి.ఐ. మద్దెయ్య ఆచారి కి ఫిర్యాదు చేయగా,విచారించి న్యాయం చేస్తామని సి.ఐ హామీ ఇచ్చారు.కాగా వైసీపీ కౌన్సిలర్ మర్రి రవి,మర్రి కళ్యాణ్ లు టీడీపీ వారు అనధికారికంగా ఓటీపి లు ఓటర్ల నుంచి సేకరిస్తున్నారని ఫిర్యాదు చేశారని,ఇరు పార్టీల వద్ద నుంచి ఫిర్యాదులు అందినట్టుంది మద్దెయ్య ఆచారి వెల్లడించారు.