38.2 C
Hyderabad
May 3, 2024 22: 46 PM
Slider హైదరాబాద్

బాలుడిపై అత్యాచారం చేసిన అరబిక్ టీచర్

#madarsateacher

పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేశాడో 25 ఏళ్ల అరబిక్ టీచర్. హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ పై ఆ బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

పది రోజులు వరుసగా బాలుడిపై అత్యాచారం చేశాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెన్నునొప్పి ఎక్కువవడంతో బాలుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సా ముందు నిరసన వ్యక్తం చేశారు.

బాలుడి కుటుంబం రెండు నెలలక్రితమే దక్షిణాఫ్రికానుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది. బాలుడికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడిన అక్తర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts

విద్యుత్  అధికారులు, కాంట్రాక్టర్లతో మహిళా రైతులు వాగ్వాదం…

Satyam NEWS

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి ఏంటో చూపిస్తా

Satyam NEWS

అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment