పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేశాడో 25 ఏళ్ల అరబిక్ టీచర్. హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ పై ఆ బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
పది రోజులు వరుసగా బాలుడిపై అత్యాచారం చేశాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెన్నునొప్పి ఎక్కువవడంతో బాలుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సా ముందు నిరసన వ్యక్తం చేశారు.
బాలుడి కుటుంబం రెండు నెలలక్రితమే దక్షిణాఫ్రికానుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది. బాలుడికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడిన అక్తర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.