మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మలకు కాంగ్రెస్ నాయకులు నేడు బంగారం సమర్పించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు మేడారం జాతరలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరం తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద పెద్ద ఆదివాసీ జాతర మేడారం జాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని వారు అన్నారు. అనంతరం భక్తులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని జెడ్పీ ఫ్లోర్ లీడర్,ఎంపీపీ లు జెడ్పీటీసీ లు తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాలపూ అనంత రెడ్డి సర్పంచ్ రేగా కల్యాణి తదితరులు కూడా పాల్గొన్నారు.
previous post