సమైక్య రాష్ట్రంలో…16 నెలల పాటు జైల్లో ఉన్న నాటి దొంగ.. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర సీఎం గా పాలన చేపట్టడం ఖర్మ అని టీడీపీ సీనియర్ నేత కంద్ర మాజీ ముఖ్యమంత్రి అశోకగజపతి రాజు అన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా విజయనగరం నియోజకవర్గ నేతల సమావశంలో మాట్లాడారు.
అశోక్ బంగ్లాలో మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ.. ఈ రోజు దేశ స్థాయి కి వెళ్లే ందుకు కార్యకర్తలే అని అన్నారు. పార్టీ కి మీరే పునాదులు అని అశోక్ అన్నారు. ఇటీవలే కొన్ని వార్తలు వస్తున్నాయని..టీడీపీ ఇంకో పార్టీ తో పొత్తు పెట్టుకుంటుందని,..అలాగే ఇంకో పార్టీ కలుస్తుందని…అవన్నీ గాలి వార్త లేనన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా.. ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తోందని.,.ఇదీ కర్మ అని అశోక విమర్శించారు.