బి ఎస్ సి బి జెడ్ సి రెండవ సంవత్సరం చదువుతున్న మైన అనే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని భావిస్తూ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల డాక్టర్ బి.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని మైనా ఆత్మహత్యకు బాధ్యుడిని చేస్తూ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరావును కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ సస్పెండ్ చేశారు. కళాశాలలో బీఎస్సీ బి జెడ్ సి 2 వ సంవత్సరం చదువుతున్న ఎం. మైన బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే, మైనా ఆత్మహత్యకు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరావు కారణమని తల్లిదండ్రులతో పాటు, గ్రామస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ విషయం పై ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు సమర్పించిన నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ సస్పెన్షన్ ఉత్తరులను జారీ చేశారు.
previous post
next post