నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ రాయిచూర్ రోడ్ ఫాదర్స్ బంగ్లా ఎదురుగా ఉన్న షాలోమ్ ప్రార్థన మందిరం స్థలంలో క్రైస్తవులు ప్రార్ధనలు చేస్తుండగా కొందరు దౌర్జన్యం చేశారని సంబంధిత పాస్టర్స్ ఆరోపించారు. మతోన్మాద భజరంగ్ దళ్ వారు ఈ దౌర్జన్యం వెనుక ఉన్నారని వారు అంటున్నారు.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కులు మత విశ్వాసాలు కలిగి ఉండటం మత ప్రచారం చేసుకోవడానికి మత ప్రచారం వృత్తి కలిగి మత భక్తిశ్రద్ధలతో మత సంస్థలను నిర్వహించుకునే స్వేచ్ఛ ఉందని వారు తెలిపారు. ఆర్టికల్ 25, 28 ప్రధాన రాజ్యాంగ సమానత్వం హక్కులకు కలిగి జీవనంగా జీవించి ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొందరు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.
ఈ విషయమై నారాయణపేట జిల్లాలోని పాస్టర్స్ మరియు క్రైస్తవులు పూర్తిగా ఖండిస్తూ వారి పైన తగు చర్యలు తీసుకోవాలని పాస్టర్స్ ప్రసాద్, యోహన్, బుజ్జప్ప, విజయ్, డేవిడ్ రాజు కోరారు. ఈ మేరకు వారు నారాయణపేట జిల్లా కలెక్టర్ ని, క్రిస్టియన్ మైనారిటీ ఆఫీసర్, ఆర్డీవో ని కలిసి మెమొరాండం సమర్పించారు.