నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల పట్టణ కేంద్రంలో లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటి పై దాడి చేసిన దుండగులు వెంటనే అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నల్లజెండాలతో నిరసన తెలుపుతూ మానవహారం నిర్వహించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎరసాని గోపాల్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ ఇంటి పై దాడి చేసి రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర ప్రభుత్వం దుండగులు పట్టుకొని ఇప్పటివరకు అరెస్టు చేయకుండా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని విమర్శించారు.
ఈ సంఘటనపై సి.బి.ఐ విచారణ జరపాలని కేంద్ర రాష్ట్రప్రభుత్వలను డిమాండ్ చేస్తున్నాం ఇకనైనా స్పందించి వెంటనే అరెస్టు చేసి దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కుటుంబ సభ్యులకు, ప్రకాష్ అంబేద్కర్ కు రక్షణ కల్పించవలసిన బాధ్యత మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వల పై ఉందని వారన్నారు.
దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు నోముల పురుషోత్తం మాదిగ బస్సు శంకర్ మాదిగ కర్రె లింగస్వామి మాదిగ బోయ అంజయ్య మాదిగ మాస నరేష్ బోయ దేవి వరప్రసాద్ బోడ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.