సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమ మొత్తం కుదేలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దాదాపుగా అందరూ దృష్టి సారించారు. అందులో భాగంగానే మహేష్ బాబు ఓటిటి ప్లాట్ ఫారమ్ పై ఇంటరెస్టు చూపిస్తున్నాడు.
ఇందులో తన సినిమాలతో బాటు బయటవారి సినిమాను కూడా విడుదల చేసి దీన్ని ఒక ప్రముఖ వ్యాపార సంస్థగా మలచాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నటు తెలుస్తున్నది. ఈ భారీ ప్రాజెక్టులో ఒక మల్టీనేషనల్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంది.
యూటీఐ, హీరోస్ లాంటి సంస్థలతో మహేష్ బాబు ఇప్పటికే కలిసి చాలా ప్రాజెక్టులలో పని చేశారు. థమ్స్ అప్, బైజూజ్ లాంటి మల్టీనేషన్ కంపెనీలతో ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు. ఆ పరిచయాలను ఈ కొత్త బిజినెస్ మోడల్ లో ఆయన వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారు.
మహేష్ ఆలోచనలకు రూపం వస్తే ఓటిటి ప్లాట్ ఫారమ్ కు కూడా కొత్త గ్లామర్ వస్తుంది. ఇప్పటికే సొంత ప్రొడక్షన్ స్థాపించిన మహేష్ బాబు సినిమాలు నిర్మిస్తున్నాడు. హైదరాబాద్ లో ఎంబి మాల్ అనే పెద్ద మాల్ కూడా ఆయన ప్రారంభించిన విషయం తెలిసిందే.