కరోనా సెకండ్ వేవ్ బలంగా వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిర్ణయం తీసుకున్నది. గతంలో విదేశీ విమాన సర్వీసులపై విధించిన నిషేధం ఈ నెల 28తో ముగియనుంది.
తాజాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.