విశాఖ నగరానికి తలమానికమైన రామకృష్ణా బీచ్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు విశాఖ నగర పాలక సంస్థ సన్నద్దమైంది. ఇందులో భాగంగా ఆర్కే బీచ్ తీరంలో కొతకు గురైన ప్రాంతంలో పునరుద్దరణ పనులు చేపడుతోంది..
ఇప్పటికే జీవీఎంసీ అటు పోర్ట్ ట్రస్ట్,ఇటు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ తో మాట్లాడింది. నగరంలో ఆర్కే బీచ్ లో సబ్ మెరైన్ ఉన్న ప్రాంతంలో కొత్తకు గురైన ప్రాంతంలో మరో ప్రాంతం నుంచీ ఇసుక ను తెప్పించి..తీర ప్రాంతాన్ని పునరుద్దరణ చర్యలు చేపడుతున్నారు.
ఈ మేరకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, డీసీఐ సీఈఓ రాజేష్ త్రిపాఠీ,డీసీఐ ఎండీ డాక్టర్ విక్టర్, డీసీఐ సీజీఎం కెప్టన్ దివాకర్, డ్రెడ్జర్ 20 కెప్టన్ లక్ష్మణరావుల ఆధ్వర్యంలో ఈ పూడిక తీత పునరుద్దరణ పనులు జరిగాయి.