ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోతామని, గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా అని ఉప్పల్ నియోజకవర్గం భారాస అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నమ్మకం తో తనను ఉప్పల్ BRS పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హరీష్ రావు లకు కృతజ్ఞతలు తెలియజేసారు. సోమవారం సాయంత్రం సైనిక్ పూరి లోని పార్టీ కార్యాలయం లో బండారి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసిఆర్ ఆదేశాల మేరకు చేరి అంబర్ పేట, బాన్సువాడ , కామారెడ్డి,ఉప్పల్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఇంఛార్జి గా పని చేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేశానని ఆయన తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ బాధ్యత అప్పజెప్పినా పార్టీ కోసం పని చేశాను అని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఉప్పల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ గులాబీ జెండా ఎగరవేస్తా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా